అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేసిన దారాసింగ్
అగ్ని జ్వాలా ప్రతినిధి: హైదరాబాద్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గా నియమించినందుకు ధారసింగ్ నాయక్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపాడు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి, అగ్ర నాయకులు శ్రీమతి సోనియా గాంధీ గారికి మరియు శ్రీ రాహుల్ గాంధీ గారికి, జనరల్ సెక్రటరీ శ్రీ కేసి వేణుగోపాల్ గారికి, తెలంగాణ ఇంచార్జీ శ్రీమతి మీనాక్షీ నటరాజన్ గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, గౌరవ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారికి , వికారాబాద్ జిల్లా DCC ప్రెసిడెంట్ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి, తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారికి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు రమేశ్ మహరాజ్ గారికి హృదయపూర్వక దన్యవాదాలు.. తెలిపారు వారి పై ఉంచిన నమ్మకం బాధ్యతను, నిబద్ధతను మరింత పెంచాయని. కాంగ్రెస్ పార్టీ పురోగతి కోసం అలుపులేకుండా పనిచేసేలా నాలో ఉత్సాహం నింపారాని. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తానని,రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు మరియు నాయకులను కలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం పునరంకితమవుతానని తెలిపారు.

