అగ్ని జ్వాలా ప్రతి నిధి: వికారాబాద్ జిల్లా గ్రూప్ 1 మరియూ గ్రూప్ 2 రెండు ఉద్యోగాలు సాధించిన యువకుడు క్రాంతికి అభినందనలు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 రెండు పోస్టులకు ఎన్నికైన తాండూరు పట్టణానికి చెందిన యువకుడు కురువ క్రాంతిని తెలంగాణ బార్ అస్ కౌన్సిల్ సభ్యులు చలకాని వెంకట్ యాదవ్ బీసీ సంఘం తాండూరు డివిజన్ కన్వీనర్ కందుకూరు రాజకుమార్ గారు అభినందించడం జరిగింది.
తాండూరు ప్రాంతానికి ప్రాంతం నుండి గ్రూప్ వన్ పోస్ట్ కు ఎన్నిక కావడం పట్ల వారు శాలువాతో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం సభ్యులు సయ్యద్ సుకూర్. క్రాంతి తండ్రి న్యాయవాది గోపాల్,అరుణ్ రాజ్ మొదలగువారు పాల్గొన్నారు.

