న్యాయవాది గోపాల్ నియామకంపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం
కాంగ్రెస్ బలోపేతానికి గోపాల్ కీలక భూమిక – శ్రేణుల్లో హర్షం
నాయకత్వ విశ్వాసానికి ప్రతీక – న్యాయవాది గోపాల్కు జిల్లా ప్రతినిధి బాధ్యతలు
అంకితభావానికి గుర్తింపు – న్యాయవాది గోపాల్కు కీలక పదవి
నాయకత్వ నమ్మకానికి న్యాయం చేస్తా జిల్లా ప్రతినిధి గోపాల్
తాండూరు:manasa news,ప్రతినిధి తాండూర్ జిల్లా అధికార ప్రతినిధిగా న్యాయవాది గోపాల్ నియామకం పొందడం పట్ల పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పార్టీకి అంకితభావంతో సేవలు అందిస్తున్న గోపాల్కు ఈ బాధ్యతలు రావడం గర్వకారణమని నాయకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా బుధవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్ నాయక్లను కలిసి గోపాల్ మర్యాదపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు.అనంతరం గోపాల్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జిల్లా అధికార ప్రతినిధిగా నియమించిన పార్టీ నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధి, బలోపేతం కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, సంక్షేమ పథకాలను ప్రతి సామాన్యునికి చేరవేయడంలో తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

