సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాండూర్ మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన
త్రాగునీరు డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని డిమాండ్ సిపిఎం
అగ్నిజాల ప్రతినిధి : తాండూర్
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాండూర్ మున్సిపల్ కార్యాలయం ముందు ప్రజలకు తాగునీరు డ్రైనేజ్ సమస్య పరిష్కరించాలని నిరసన తెలియజేయడం జరిగింది తాండూర్ మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ* కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరికీ త్రాగునీరు డ్రైనేజ్ సమస్య విద్యుత్ దీపాల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు అదే విదంగా కాంగ్రెస్ ప్రభుత్వం తాండూర్ పట్టణం మున్సిపల్ పరిధిలో ఇందిరానగర్ 2వ వార్డ్ లో త్రాగునీరు డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ తాండూర్ మున్సిపల్ కమిషనర్ ప్రతి వార్డులో ప్రజలకు కోసం త్రాగునీరు కోసం కొత్తగా బోరింగ్ వేయించాలని మంచినీటి , డ్రైనేజ్ పరిష్కరించాలని ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన సంవత్సరకాలం గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చేయకుండా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నది తాండూరు పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు త్రాగునీరు డ్రైనేజీ విద్యుత్ విధి దీపాలు సమస్య లు పరిష్కరించాలని తాండూర్ మున్సిపల్ పరిధిలో ఇల్లు లేని నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ లు, రేషన్ కార్డులు ఇవ్వాలని పింఛన్లు ఇవ్వాలని ప్రజలకు ఇచ్చిన హామీలు చేయాలని డిమాండ్ చేశారు ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అని హెచ్చరించారు సిపిఎం నాయకులు రాజు సురేష్ 2 వ వార్డు ప్రజలు నారాయణ లక్ష్మి గిరమ్మ రేణుకు ఇంతియాజ్ మహిళలు పాల్గొన్నారు

