వేల గొంతులు-లక్ష డప్పుల కార్యక్రమానికి మద్దతుగా డప్పులు అందించిన ఆదివాసీ నాయకులు తంబల్ల రవి
భద్రాద్రి: అగ్ని జ్వాలా ప్రతినిధి :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజవర్గం ఆదివాసీ నాయుకులు తంబళ్ల రవి గారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ అన్న తలపెట్టిన వేల గొంతులు-లక్ష డబ్బులు కార్యక్రమానికి మద్దతుగా స్థానికంగా ఉన్న mrps నాయకులకు కొన్ని డప్పులు అందజేశారు,వారు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ అన్నా గారు గత 30 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేస్తున్నారని,వర్గీకరణ వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని,హైదరాబాదులో వారు తలపెట్టిన కార్యక్రమం విజయవంతం అవ్వాలని కోరుతున్నట్లు ఆదివాసీ నాయకులు తంబల్ల రవి తెలిపారు.

