* మానవత్వం చాటుకున్న దిశా కమిటీ సభ్యురాలు శ్రీమతి యేసుమని
అగ్నిజాల ప్రతినిధి
మానవత్వం చాటుకున్న దిశా కమిటీ సభ్యురాలు శ్రీమతి యేసుమని మరియు సేవా రత్న అవార్డు గ్రహీత తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముళ్ళ పూడి వెంకటేశ్వరరావు…… దమ్మపేట మండలం రాచూరు పల్లి పంచాయతీ లచ్ఛాపురం గ్రామంలో రావూరి రాంబాబు అను వ్యక్తి గత కొన్ని నెలలుగా అనారోగ్య కారణాల చేత మంచం లోనే ఉంటూ ఉన్నారు ఆయనకు తలలో రక్తం గడ్డకట్టుటవలన ఫిట్స్ వచ్చి పడిపోతూ ఉంటున్నాడు ఈయనకు హాస్పిటల్ ఖర్చులు కొరకు దిశా కమిటీ సభ్యురాలు ఆర్థికంగా సహాయం చేశారు అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సేవ రత్న అవార్డు గ్రహీత అయిన ముళ్ళపూడి వెంకటేశ్వరరావు గారు వారి దయనీయ పరిస్థితిని చూసి వారికి ఒక నెలకు సరిపడా నిత్యవసర సరుకులు మరియు బియ్యం అందించారు దీనితో ఆ కుటుంబం మరియు గ్రామ ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో దమ్మపేట మండల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ ఇశ్రాయేలు గారు, తెలంగాణ రాష్ట్ర ఆదివాసి పాస్టర్స్ సెక్రటరీ కోండ్రు శ్యాం బాబు గారు, జోసెఫ్ గారు మరియు మల్కారం ఎంపీటీసీ నాయుడు శ్రీను గారు, వెస్లీ, వంశి, సునీల్, అన్నవరపు పుల్లారావు, తంగేళ్ల విశ్వనాథ్ మరియు గ్రామ పెద్దలు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

