నియోజకవర్గ స్థాయి జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ సన్నాహక సమావేశం
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన జై బాపు,జై భీమ్, జై సంవిధాన్ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మరియు ప్రోగ్రామ్ కో ఇంచార్జీ రాజీవ్ రెడ్డి..
అగ్ని జ్వాలా ప్రతి నిధి: తాండూర్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ మాట్లాడుతూ…
రాజ్యాంగంలో పొందుపరచిన హక్కులను కాపాడుకోవడానికి ప్రజలంతా ఏకమై పార్టీలకతీతంగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని హక్కులను కాపాడుకోవాలని అన్నారు
అలాగే మండలాల వారీగా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో సన్నాహాక సమావేశలు నిర్వహించి గ్రామ గ్రామన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించే విధంగా కార్యాచరణ ఏర్పాటు చేయాలని అన్నారు, అలాగే రాహుల్ గాంధీ ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న ప్రతి కమిటీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని సూచించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి , ఇంచార్జీ రాజీవ్ రెడ్డి
అనంతరం ఇంచార్జీ రాజీవ్ రెడ్డి కార్యక్రమానికి సంబంధించిన కిట్ ను పార్టీ అధ్యక్షులకు అందజేశారు.
ఈ సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు, మహిళ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ యూ ఐ తో పాటు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

