తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ మరియు చండీశ్వర ఒగ్గుకళా సేవా సమితి మరియు శ్రీ మల్లికార్జున ఒగ్గుకళా సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ప్రజకళాల పరిరక్షణలో భాగంగా ఒగ్గు డోలు విన్యాసం బుధవారం నాడు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం గ్రామం,,ఎంకేపల్లి లో ఉదయం 11:30 గంటలకు ప్రధాన శిక్షకులుగా Dr.ఉస్తాద్ ఒగ్గురవి అన్న మరియు ఒగ్గు బీరు,ఒగ్గు అశోక్,ఒగ్గు మధు తాండూరు మండల అధ్యక్షులు జినుగుర్తి నర్సింహులు . యాలాల్ మండల్ అధ్యక్షులు సతీష్ పూజా కార్యక్రమాలు నిర్వహించి టెంకాయ కొట్టి ఒగ్గుడోలు శిక్షణ శిబిరం ప్రారంభించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో తాండూర్ డివిజన్ కురువ సంఘం ఉపాధ్యక్షులు పూజారి పాండు తాండూర్ మండల్ గౌరవాధ్యక్షులు చీమల నర్సింహులు . ఆలయ ధర్మకర్త పూజారి కృష్ణప్ప . ఇట్టి కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అపూర్వ సహకారంతో ఈ శిక్షణ శిబిరం 7 రోజులపాటు కొనసాగిస్తున్నందున ఒగ్గు బీరు ధన్యవాదాలు తెలియజేసారు