రాజ్యాంగ విలువలని కాపాడేది కాంగ్రెస్ ప్రభుత్వాలే 

సామాజిక న్యాయం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక కుల గణన సర్వేను ప్రజలందరూ ఉపయోగించుకోవాలి.
రాజ్యాంగ విలువలని కాపాడేది కాంగ్రెస్ ప్రభుత్వాలే 
• గతంలో కెసిఆర్ ప్రభుత్వం సామాజిక న్యాయానికి ద్రోహం చేసింది.
స్టేట్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ మహమ్మద్ అమీర్.

 

* ఈనెల 6 నుంచి 18 వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సామాజిక కుల గణన సర్వేను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని స్టేట్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ మహమ్మద్ అమీర్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
* రాజ్యాంగ విలువలని కాపాడడానికి సామాజిక న్యాయమే ప్రధాన అంశంగా ఈ సర్వే ఉంటుందని వారు తెలిపారు. సమాజంలో కొందరికి అన్ని ప్రభుత్వాలు పనిచేశాయని దానివల్ల పేదలు మరింత పేదలుగా ధనవంతులు మరింత ధనవంతులుగా మారిపోయే పరిస్థితి వచ్చిందని వారు తెలిపారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలైన దళితులు వెనుకబడిన కులాలు శ్రద్ధతో ఈ సర్వే ను ఉపయోగించుకోవాలని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రజలకు సామాజిక న్యాయం దొరుకుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా క్యాస్ట్ సెన్సెస్ చేపట్టాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *