శాసన మండలి నూతన భవన ప్రారంభోత్సవంలో ప్రముఖ నేతలు
శాసన మండలి పునర్ నిర్మాణ భవనాన్ని సందర్శించిన స్పీకర్, మంత్రులు, చీఫ్ విప్
శాసన మండలి నూతన భవనం ప్రారంభం
శాసన మండలి నూతన భవన ప్రారంభోత్సవంలో ప్రముఖ నేతలు
పునర్ నిర్మిత శాసన మండలి ప్రారంభోత్సవంలో పాల్గొన్న చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి
హైదరాబాద్, manasa news ప్రతినిధి :పునర్ నిర్మితమైన తెలంగాణ శాసన మండలి భవన ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు.ఈ వేడుకలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి కూడా పాల్గొని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సందర్శించారు. పునర్ నిర్మితమైన శాసన మండలి భవనం ఆధునిక సదుపాయాలతో నిర్మించబడినట్లు, ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఇది ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని నేతలు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ శాసనసభ, శాసన మండలి కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా కొనసాగాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

