త్రాగునీరు సమస్య పరిష్కరించాలని సిపిఎం డిమాండ్
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాండూర్ పట్టణంలో ఇందిరానగర్ 2వ వార్డులో త్రాగునీరు సమస్య పరిష్కరించాలని స్థానిక మహిళలతో కలిసి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని తాండూర్ మున్సిపల్ పరిధిలో త్రాగునీరు సమస్య విద్యుత్ దీపాల సమస్య మోరీల సమస్య తీవ్రంగా ఉంది అన్నారు తాగునీరు కోసం ఎండాకాలం స్థానికంగా ఉన్న మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నారు మున్సిపల్ కమిషనర్ గారు అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి తాగునీరు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీ మహాలక్ష్మి పథకం ఇందిరమ్మ ఇండ్లు పింఛన్ రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు స్థానిక మహిళలు లక్ష్మి ఇంతియాజ్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

