“తాండూరులో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గర్వకేతన ర్యాలీ”
అగ్నిజ్వాలా ప్రతినిధి: తాండూర్
తాండూరు: 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి భావాలను అలవరచడానికి భాగంగా “హర్ ఘర్ తిరంగా” అభియాన్లో భాగంగా తాండూరు బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించబడుతుంది.ఈ ర్యాలీ రేపు 14-08-2025 ఉదయం 10 గంటలకు గంజ్ రేణుక ఎల్లమ్మ గుడి వద్ద ప్రారంభమై, మల్లప్ప మడిగా, శివాజీ చౌక్, వి.వి.హెచ్.ఎస్, మర్రి చెట్టు కూడలి, గాంధీ చౌక్, భద్రప్ప గుడి చౌరస్తా, మార్వాడి బజార్, డీఎస్పీ ఆఫీస్ సర్కిల్, శాంతి మాల్ చౌరస్తా, వినాయక చౌక్, ఇంద్ర చౌక్ మీదుగా అంబేద్కర్ కూడలి, బస్టాండ్ సర్కిల్ వరకు కొనసాగుతుంది.ఈసందర్భంగా బిజెపి శ్రేణులు, జాతీయవాదులు, రాజకీయ నాయకులు, వ్యాపార సంఘాల నేతలు, కుల సంఘాల నాయకులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, పాల్గొనాలని అన్నారు

