ఆశ వర్కర్స్ కి ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసేంతవరకు పోరాటం సీఐటీయూ
అగ్నిజ్వాల ప్రతినిధి :తాండూరు
సిఐటియు తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆశ వర్కర్ సమస్యలు పరిష్కరించాలని తాండూర్ తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలియడం జరిగింది
అసెంబ్లీ సమావేశాలలోనే ప్రభుత్వము ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీల అమలుకు చర్యలు చేపట్టాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కే శ్రీనివాస్ మాట్లాడు తా అన్నారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తాండూర్ మండల ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 ఫిబ్రవరి 9న జూలై 30న డిసెంబర్ 10న ఆరోగ్యశాఖ కమిషనర్ ఆఫీస్ ముందు ఆశాలు ధర్నా చేసిన సందర్భంగా నాటి కమిషనర్ ఆశా వర్కర్లకు 50 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని, మట్టి ఖర్చుల కింద 50,000 ఇస్తామని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సెలవులు ఇస్తామని, టార్గెట్స్ రద్దు చేస్తామని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారని అన్నారు కానీ ఇచ్చిన హామీల నేటి వరకు అమలు చేయలేదని అన్నారు సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చినప్పటినుండి నేటి వరకు దశల వారీగా అధికార యంత్రాంగం ఎమ్మెల్యేలకు మంత్రులకు విజ్ఞప్తులు చేసిన ఆశ వర్కర్ల గోడు పట్టించుకోలేదని అన్నారు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ల కు కనీసం ఆదివారం పండుగల సందర్భంగా సెలవులు కూడా ఇవ్వడం లేదని అన్నారు కావున ప్రభుత్వం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలోనే ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18000 నిర్ణయించి ఇచ్చిన ఇతర హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తాండూర్ MRO అందజేశారు సమస్యల పరిష్కారం కోసం బుధవారం నాడు జరిగే చలో కలెక్టరేట్ కార్యక్రమానికి ఆశా వర్కర్లు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు రేణుక అరుణ రమాదేవి ఆశ వర్కర్స్ అనంతమ్మ రాములమ్మ అరుణ

