ప్రజల కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తి కె భాస్కర్
తాండూర్: అగ్నిజాల ప్రతినిధి
వికారాబాద్ జిల్లా యాలాల మండలం అన్నసాగర్ గ్రామానికి చెందిన కర్రే భాస్కర్ మొదటి వర్ధంతిని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి శాంతి సమాధానం కలగాలని కోరారు భార్య సరోజ ఇద్దరు కుమారులు రాజు రవితేజ కుమార్తె సుధారాణి కూడా ఉన్నారు గ్రామస్తులు నిర్వహించిన మొదటి వర్ధంతి సభలో వారు మాట్లాడుతూ కుటుంబం కోసం పనిచేయడం తక్కువగా ఆలోచించేవాడని ప్రజా సేవ కోసమే ఎక్కువ పని చేసేవాడని తెలిపారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేసే నాయకుల్ని కోల్పోవడం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు

